Sunday, February 5, 2012

నవభారత పుత్రులారా! నిర్మోహితులు కండు




"ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యవరాన్నిబోధత!" 'లెండు, మేల్కొనుడు, పరమార్ధము చేరువరకు ఆగకుడు' అని ప్రతి జీవికిని చాటి చెప్పుదుము గాక!" "లెండు, మేల్కొనుడు! దుర్బలత నుండి, సమ్మోహనము నుండి తెప్పరిల్లుడు. నిజముగా ఎవడును దుర్బలుడు కాడు! ఆత్మ అఖండము; సర్వశక్తిమంతము, సర్వజ్ఞము. లేచి నిలబడుడు! మీ స్వరూపమును ప్రకటింపుడు! మీలో నున్న బ్రహ్మమును ప్రకాశింపచేయుడు! వానిని నిర్లక్ష్యము చేయకుడు. మితిమీరిన సోమరితనము, మితిమీరిన దౌర్బల్యము, మితెమీరిన మోహజాలము శనిదేవత వలె మన నెత్తిపైకెక్కి చిందులు ద్రొక్కుచున్నవి. 

----------------------------------------------------------------------
మన ప్రాచీన జనయిత్రి మరల మేల్కొనినది. ఆమె తన సింహాసనము నధిష్టించినది. అపూర్వమైన శోభతో ఉత్తేజితమైనది. శాంతి స్వరముతో, మంగళ వచనములతో ఆమెను గురించి జగత్తునకు చాటిచెప్పుడు
----------------------------------------------------------------------

ఓహో! నవభారత పుత్రులారా! మీ సమ్మోహనము విదిల్చివేసికొనుడు. దానికి వలయు మార్గము మీ శాస్త్రములందే  కలదు. మీ సత్య స్వరూపమును మీరు తెలిసికొనుడు. ప్రతివానికి వాని స్వస్వరూపము బోధింపుడు. నిద్రలో పడియున్న జీవుని ఎలుగెత్తి పిలువుడు. ఓహో! అతడెటుల మేల్కొనునో మీరే చూడగలరు. ఆ సుప్తజీవి మేల్కాంచి, స్వస్వరూప జ్ఞానముతో కార్యపరుడగునప్పుడు అతనికి శక్తి వచ్చును; తేజము వచ్చును; శుభము గలుగును; పవిత్రతయు వచ్చును. ఉత్క్రుష్టమగునదెల్ల  అతనిని వరించును.

భవిష్యత్తు విషయమై నేనాలోచించుట లేదు; ఆ విషయమై నాకు శ్రద్ధ లేదు. ఒక దివ్య దృశ్యమును మాత్రమే నేను చూచుచున్నాను. జీవితమంతా స్పష్టముగా కనుచున్నాను. అది ఇది - మన ప్రాచీన జనయిత్రి మరల మేల్కొనినది. ఆమె తన సింహాసనము నధిష్టించినది. అపూర్వమైన శోభతో ఉత్తేజితమైనది. శాంతి స్వరముతో, మంగళ వచనములతో ఆమెను గురించి జగత్తునకు చాటిచెప్పుడు".  
 
 http://www.lokahitham.net/2012/01/blog-post_9658.html

No comments:

Post a Comment